telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్ కేసులో నమ్రత పేరు రావడంపై బండ్ల గణేష్ రియాక్షన్

bandlaganesh request on movie event

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణలో ఆమె ప్రేయసి రియా చక్రవర్తి డ్రగ్స్ కోణం బయటపడడంతో బాలీవుడ్ డ్రగ్స్ కేసు సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయ సాహాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించినప్పుడు ఆమె పలువురు పేర్లను బయటపెట్టారని, జయ సాహాతో డ్రగ్స్ కోసం ఛాటింగ్ చేసిన వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, ఒకప్పటి హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ పేరు కూడా ఉందని నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పందించారు. నమ్రతా శిరోద్కర్‌కు ఆయన తన మద్దతు తెలిపారు. ఆమె స్వభావం ఎలాంటిదో వివరించారు. డ్రగ్స్ కేసు గురించి ప్రస్తావించకుండానే.. “ఆమె నాకు 15 ఏళ్లుగా తెలుసు. చాలా మంది మహిళలకు ఆమె స్ఫూర్తిదాయకం. ఆమె ఒక గొప్ప భార్య, ఒక గొప్ప తల్లి. నమ్రతా అంటే నాకెంతో గౌరవం” అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. నమ్రతకు మద్దతుగా నిలిచిన బండ్లకు మహేష్ బాబు అభిమానులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అయితే, కొంత మంది అభిమానులు ఈ విషయాన్ని అనవసరంగా పెద్దది చేసి ప్రచారం చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వినిపించింది.

Related posts