telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ : .. కొత్త గవర్నర్ సౌందరరాజన్‌కు .. ఘనస్వాగతం..

warm welcome to sundarrajan to telangana

బేగంపేట విమానాశ్రయంలో, రాష్ట్ర నూతన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ఘన స్వాగతం లభించింది. ఈ ఉదయం చెన్నై నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి తమిళిసై చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, అధికారులు తదితరులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం తమిళిసై రాజ్‌భవన్‌ చేరుకున్నారు.

నేడు 11 గంటలకు తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్‌లో గవర్నర్‌గా ప్రమాణం చేయనున్నారు. ఆమెతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు.

Related posts