telugu navyamedia
తెలంగాణ వార్తలు

దర్శనానికి వచ్చిన భక్తుడిపై పూజారి దాడి..

సికింద్రాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. దైవ దర్శనం కోసం ఆలయానికి వచ్చిన భక్తుడిపై పూజారి దాడికి దిగాడు. ఉప్పల్ బాలాజీహిల్స్ కి చెందిన వాల్మీకీరావు గత రెండు రోజుల క్రితం రాత్రి 7 గంటల సమయంలో దర్శనం చేసుకుందాం అని సికింద్రాబాద్ రైతిపైల్ బస్టాండ్ కి అనుకుని ఉన్న గణేష్ టెంపుల్ కి వెళ్లి దర్శనం చేసుకున్నారు.

ప్రధాన ఆలయంలో దర్శనం చేసుకున్న అనంతరం పక్కనే ఉన్న ఉప ఆలయాలను దర్శించుకుంటున్న సమయంలో అనుమతి లేకుండా ఆ గుడి లోపలికి ఎలా వెళ్తావని పూజారి ప్రభాకర్ శర్మకు, భక్తుడికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

అదే సమయంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఆగ్రహానికి లోనైన పూజారి వాల్మీకిరావుపై విచక్షణా రహితంగా ఆలయంలోనే దాడి చేశాడు. ఒక్కసారిగా అర్చకుడు ప్రభాకర్ శర్మ దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాడి చేయడమే కాకుండా భక్తుడిని బెదిరిస్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది..దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది.

బాధితుడి గోపాలపురం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు  పూజారి ప్రభాకర్ ని కస్టడిలోకి తీసుకోని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మ‌రోవైపు ..పూజలు చేసి,భక్తులను ఆశీర్వదించాల్సిన పూజారే ఒక రౌడీ లాగా రెచ్చిపోయి భక్తుని పై దాడి చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. గుడిలో భక్తుడిపై పూజారి దాడి చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేసారు.

Related posts