కంటోన్మెంట్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కాంగ్రెస్ నేత మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్వీఆర్ చంద్రశేఖర్ను ఆయన కలిశారు. కంటోన్మెంట్ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, పెండింగు ప్రాజెక్టులపై చర్చించారు. కంటోన్మెంట్ ప్రజల సమస్యల పరిష్కారాని తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రితో మాట్లాడతానన్నారు. కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కృషి చేస్తానని చెప్పాడు.
కంటోన్మెంట్లో నీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఆస్తిపన్ను వసూలులో వ్యత్యాసం ఉన్నదని, బంగ్లాలను, లీజు స్థలాలను చాలా మంది ఏళ్లుగా ఆక్రమించి అడ్డగోలు వ్యాపారాలు చేస్తున్నారని అన్నారు. అందుకే జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ను విలీనం చేయాలనే అంశాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. విలీనం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తానని రేవంత్ పేర్కొన్నారు.