మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన “చిత్రలహరి” ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం ఇచ్చిన బూస్ట్ తో సాయిధరమ్ తేజ్ చేస్తున్న తర్వాత చిత్రం “ప్రతిరోజు పండగే”. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. “ప్రతిరోజు పండగే” అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో సరికొత్త లుక్లో తేజూ కనిపించనున్నాడు. ఈ మూవీ ప్రేక్షకులకి పసందైన విందు అందించడం ఖాయమని అంటున్నారు. “చిత్రలహరి” విజయం తర్వాత తేజు పెద్ద నిర్మాణ సంస్థలతో చేతులు కలపడం విశేషం. సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రముఖ నటుడు సత్యరాజ్ , సాయిధరమ్ తేజ్ వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న లుక్ సినిమాపై మంచి అనుభూతి కలిగించే విధంగా ఉంది. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సుప్రీం తర్వాత రాశి ఖన్నా మరోసారి సాయిధరమ్ తేజ్ తో రొమాన్స్ చేస్తోంది. డిసెంబర్ లో ప్రతిరోజూ పండగే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
previous post
next post
బిగ్ బాస్-3పై మహేష్ విట్టా షాకింగ్ కామెంట్స్