థియేటర్లకు 100శాతం ఆక్యుపెన్సీతో తెరుచుకోవచ్చనడంతో మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్లు అన్నీ కూడా జోరు చూపిస్తున్నాయి. వాటికి తగ్గట్టుగా సినిమా రిలీజ్ డేట్లు వస్తున్నాయి. తాజాగా బాలవుడ్లోని ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ వారు తన సంస్థ నుంచి రానున్న ఐదు సినిమా రిలీజ్ డేట్స్ను ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పృథ్వీ రాజ్ కూడా ఉంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో చేస్తుండగా మనుషి చిల్లర్ హీరోయిన్ పాత్రలో చేయనున్నారు. అంతేకాకుండా సంజయ్ దత్, సోనూ సూద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న జెర్సీ సినిమాతో పోటీ పడనుంది. జెర్సీ సినిమా తెలుగులో నాచురల్ స్టార్ హీరోగా 2019లో తెరకెక్కిన జెర్సీ చిత్రానికి రీమేక్గా రూపొందుతోంది. ఈ చిత్రం తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలు కూడా నవంబర్5న విడుదల కానున్నాయి. అయితే మొదటగా జెర్సీ మేకర్స్ ఈ డేట్ను ఫిక్స్ చేశాయి.
previous post