telugu navyamedia
సినిమా వార్తలు

‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ పిక్స్ వైరల్‌

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. కె. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్‌ బిజీగా ఉంది. పీరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న‘రాధేశ్యామ్‌’ వచ్చే సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. తాజా షెడ్యూల్‌ షూటింగ్ కడప జిల్లాలోని గండికోటలో జరుగుతోంది. ఇందులో వేద పాఠ‌శాల‌ గురువుగా స‌త్య‌రాజ్ నటిస్తున్నారు. ఆయ‌న‌తో పాటు కొంద‌రు అఘోరాల‌తో పాటు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. గండికోటలో రాధేశ్యామ్ షూటింగ్ జరుగుతుందన్న సమాచారంతో ప్రభాస్ ఫ్యాన్స్ అక్కడికి భారీగా చేరుకుంటున్నారు.

Related posts