టోక్యో ఒలింపిక్స్లో పతకం సాధించిన తరువాత పీవీ సింధుతో కలిసి ఐస్క్రీమ్ తింటానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్లో భాగంగా కాంస్య పతకం కోసం జరిగిన పోరులో పీవీ సింధు విజయం సాధించింది. సింధు 21-13, 21-15 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్ జియావోపై గెలుపొందింది.
దీంతో ప్రధాని మోదీతో కలిసి ఐస్ క్రీమ్ తినే అవకాశం కూడా దక్కింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మోదీ. టోక్యో ఒలింపిక్స్కు వెళ్ళే ముందు అథ్లెట్లతో మోదీ ప్రతేక్యంగా మాట్లాడారు. వారి వ్యక్తిగత ఇష్టాలు గురించి అప్పుడు ప్రస్తావించారు. పీవీ సింధుకు ఐస్క్రిమ్ ఇష్టమని తెలుసన్నారు. ఈమేరకు మోడీ ‘హార్డ్ వర్క్ చేయ్.. నీ మీద నమ్మకం ఉంది. ఈ సారి కూడా విజయం సాధిస్తావ్. నీ విజయం తర్వాత మీ అందరినీ కలుస్తా. ఐస్క్రీమ్ తిద్దామని పీవీ సింధుకు స్పూర్తినిచ్చారు.
ఒలింపిక్స్లో వరుసగా రెండ పతకాలు (రజతం, కాంస్యం) సాధించిన తొలి తొలి భారత మహిళా క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. వెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణంతో సహా ఏడు పతకాలతో భారత అథ్లెట్లు టోక్యో నుంచి తిరిగి వచ్చారు. ఒలింపిక్స్లో భారత్కు ఇది రెండో వ్యక్తిగత స్వర్ణం. దాంతో నీరజ్ని ప్రశంసలతో ముంచేత్తారు.
ఈ నేపథ్యంలో..టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారులతో ప్రధాని మోదీ నివాసంలో సమావేశమయ్యారు. ఆత్మీయంగా మాట్లాడి.. వారు సాధించిన విజయాలను ప్రశంసించారు. ముందు ముందు బాగా రాణించి మరిన్నీ పతకాలు మన దేశానికి తీసుకురావాలని సూచించారు. ఆ తరువాత ఒలింపిక్ విజేతలందరికి మోడీ ఈ రోజు తేనీటి విందు ఇచ్చారు.