సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” టీజర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ సూపర్ స్టైలిష్గా కనిపించనున్నారు. బ్యాంకింగ్ రంగంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9న “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు మొదలైన “బ్లాస్టర్” తుఫాను ఇంకా తగ్గనేలేదు. 24 గంటల్లో ఇప్పటి వరకు 33 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్లో ట్రెండింగ్లో కొనసాగుతోంది. అల్ టైం హైయెస్ట్ బిడ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీగా “సర్కారు వారి పాట” టీజర్ రికార్డు క్రియేట్ చేసింది. 754కే+ లైక్స్ తో దూసుకెళ్లింది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేసి ప్రకటించారు.
ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు అదిరిపోయే కామెడీ కూడా ఉండనుందట. ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ గోవాలో హీరో హీరోయిన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది.