టాలీవుడ్ లో “మహర్షి” చిత్రం తర్వాత మరో పెద్ద సినిమా తెలుగు ప్రేక్షకులని పలకరించలేదు. ఆగస్ట్ 15న ప్రభాస్ “సాహో” చిత్రం విడుదల కానుంది. అయితే ఈ లోపు చిన్న, మధ్య స్థాయి సినిమాలు ప్రేక్షకులకి వినోదం అందించేందుకు సిద్ధమయ్యాయి. జూన్ 21న ఐదుకి పైగా సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే మల్లేశం, ఫస్ట్ ర్యాంక్ రాజు, కెప్టెన్ రాణా ప్రతాప్, ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ ,మంచు విష్ణు ‘ఓటర్’ జూన్ 21న రిలీజ్ అయ్యేందుకు సిద్దమయ్యాయి. మరి కొన్ని తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా అదే రోజు విడుదల కానున్నట్టు సమాచారం. మరి దీనిని బట్టి చూస్తుంటే జూన్ 21న బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక జూన్ 14న విశ్వామిత్ర, వజ్ర కవచాదరా గోవిందా, గేమ్ ఓవర్, ఐ లవ్ యు (డబ్బింగ్) చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో జూన్ 14న కూడా పలు సినిమాల మధ్య ఆసక్తికర పోటీ జరగనుంది.
previous post
అంతా నా విగ్రహాలు పెట్టుకోవాలి : నటి హేమ