సామజిక మాధ్యమాలలో పలు రకాల ఛాలెంజ్ లు నడుస్తున్నాయి. ఇప్పుడో రకమైన ఛాలెంజ్ బాలీవుడ్ లో నడుస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం తింటూ వాటికి సంబంధించిన ఫోటోలని షేర్ చేయాలని బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా వాట్స్ ఇన్ యువర్ డబ్బా పేరుతో ఓ ఛాలెంజ్ స్టార్ట్ చేసింది. ట్వింకిల్ మొదట ఈ ఛాలెంజ్ని అక్షయ్కి విసరగా ఆయన హ్యాపీగా స్వీకరిస్తూ దీనిని శిఖర్ ధావన్, కత్రినా కైఫ్కి విసిరారు.
తాజాగా ఈ ఛాలెంజ్ని స్వీకరించిన కత్రినా బ్రేక్ఫాస్ట్లో తింటున్న ఇడ్లీ ఫోటోలని షేర్ చేసింది. నేను ఎలాంటి డైట్ ఫాలో కానని ఈ సందర్భంగా పేర్కొంది కత్రినా. తాను ఈ ఛాలెంజ్కి వరుణ్ ధావన్ని నామినేట్ చేసింది.