telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఇకపై కాల్స్ రింగింగ్ 25 సెకన్లే!

cell phone

టెలికాం సంస్థలు ఫోన్ కాల్స్ రింగింగ్ సమయాన్ని తగ్గించారు. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ ఫోన్ కాల్స్ రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించాయి. ఇప్పటి వరకు 30 నుంచి 45 సెకన్ల పాటు ఫోన్ కాల్స్ రింగ్ అయ్యేవి. కానీ ఇకపై తగ్గించిన సమయం మేర రింగ్ అవుతాయి. అయితే ఆ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటానికి గల కారణం జియోనే అని తెలుస్తోంది. ఇటీవలే జియో ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జి (ఐయూసీ) నిబంధనలకు విరుద్ధంగా రింగింగ్ సమయాన్ని 20 సెకన్లకు తగ్గించి.. మళ్లీ 5 సెకన్లు పెంచి.. ఆ సమయాన్ని 25 సెకన్లు చేసింది.

దీంతో జియో బాటలోనే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఆ సమయాన్ని 25 సెకన్లకు కుదించాయి. అయితే వొడాఫోన్ ఐడియా మాత్రం దేశంలోని పలు ప్రాంతాల్లో కాల్స్ రింగింగ్ సమయాన్ని పాత పద్ధతిలోనే కొనసాగిస్తున్నాయి. కాగా జియో ఐయూసీ చార్జిలను ఎక్కువగా చెల్లిస్తున్నందువల్లే ఆ ఖర్చును తగ్గించుకోవడానికి రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు కుదించిందని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఆరోపిస్తున్నాయి.

Related posts