గ్రామ సచివాలయాల ద్వారా జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న పాలనను తీసుకొస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కరపలో గ్రామ సచివాలయ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఇప్పుడు జరగరాదని చెప్పారు. మీ పార్టీ ఏదని అడిగి గతంలో జన్మభూమి కమిటీలు పని చేసేవని… ఎక్కడ చూసినా అవినీతి ఉండేదని తెలిపారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు కుల, మత, పార్టీలకు అతీతంగా పని చేయాలని సూచించారు. మనమే అధికారంలోకి వచ్చేలా ప్రజలకు సేవలందించాలని చెప్పారు.
నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని జగన్ తెలిపారు. డిసెంబర్ నాటికి ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జనవరి 1 నుంచి అర్హులైన అందరికీ రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులను అందజేస్తామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. అన్నింటినీ డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు. ప్రతి రైతుకు రూ. 12,500 అందించి ఆదుకుంటామని చెప్పారు. అవినీతిరహిత పాలనే లక్ష్యంగా చేసిన గొప్ప ప్రయత్నమే సచివాలయ వ్యవస్థ అని సీఎం స్పష్టం చేశారు.
టీడీపీ, వైసీపీకి సమాన దూరంలో బీజేపీ: కన్నా