తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గురువారం అర్థరాత్రి ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సబితా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మంత్రి సబితా ఆరోగ్యంపై పలువురు మంత్రులు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
సబిత ఆరోగ్యంపై ఇంతవరకూ కుటుంబ సభ్యులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. మంత్రికి ఆరోగ్యం సర్లేదన్న విషయం తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందారు. పెద్ద ఎత్తున అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు సబితా చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రికి తరలివెళ్లినట్లు తెలుస్తోంది.