కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నెల 7 ప్రారంభమైన పెట్రో బాదుడు కొనసాగుతోంది. వరుసగా 21వ రోజు కూడా ధరలు పెరిగాయి. నేడు లీటరు పెట్రోలుపై 25 పైసలు పెరగ్గా, డీజిల్పై 21 పైసలు పెరిగింది.
ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 80.38కు చేరుకోగా, డీజిల్ ధర రూ.80.40కు పెరిగింది. తాజా పెంపుతో గత మూడు వారాల్లో డీజిల్పై 10.27 రూపాయలు, పెట్రోలుపై 9.18 రూపాయలు చొప్పున పెరిగాయి. జూన్ 1న రూ.71 ఉన్న లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.80.38కు చ్చెరుకుంది.
అమరావతి రాజధానిని జగన్ అప్పట్లో ఆమోదించారు: సీపీఐ నారాయణ