ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వివిధ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కోవిడ్ భారీనపడుతున్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, అచ్చెన్నాయుడు వంటి రాజకీయవేత్తలు దీని బారిన పడ్డారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
దీంతో ఆయన హైదారాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కూడా కరోనా సోకింది. ఏపీలో ఇప్పటి వరకు 4,34,771 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 3,30,526 మంది కోలుకున్నారు. వైరస్ భారీనపడి 3,969 మంది మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియాలో ఉందా ? లేక పాకిస్తాన్ లో ఉందా?