సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం ప్రతి రోజూ పండగే, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల ద్వారా రిలీజ్ అయింది ..ఇటీవల విడుదలైన చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఇవాళ రిలీజ్ అయిన ఈచిత్రం ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది తప్ప సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేదు అని ప్రేక్షకులు అభిప్రాపడుతున్నారు. కామెడీ బాగా పండింది..కానీ మెగా హీరో గ్రేడ్ మాత్రం కనిపించలేదని టాక్ వినపడుతుంది..అసలు విషయానికొస్తే… సినిమా కథ ఎదో పుస్తకాల కథను అల్లినట్లు ఉందనే వార్తలు వినపడుతున్నాయి..ఇంకా కథలోకి వెళ్లినట్టయితే సత్యరాజ్ లంగ్ (ఊపిరితిత్తుల)క్యాన్సర్ తో బాధపడతారు అయితే తన ఆఖరి రోజుల్లో గడిపే కొన్ని క్షణాలు అయినా సంతోషంగా ఉంచాలని యూఎస్ నుంచి సాయి తేజ్(సాయి ధరమ్ తేజ్) ఇండియాలోకి రాజమండ్రి లోని తన ఊరికి బలదేరుతాడు.అక్కడ నుంచే తన కుటుంబాన్ని ఒకే చోటుకు చేర్చాల ని ప్లాన్ చేస్తాడు. ఈ సినిమా లో ఉండాల్సినవి లేకపోవడం తో సినిమా బోల్తా కొట్టిందనే విషయాలు తెలుస్తున్నాయి..కథకు, సిచ్యువేషన్ కు తగ్గట్లు కథ సాగలేదని జానాలు అభిప్రాయపడుతున్నారు.. అందుకే సినిమా మొత్తని యావరేజ్ అనే టాక్ ను అందుకుంది. ఈ సినిమా లోని ప్లస్, మైనస్ పాయింట్స్ విషయానికొస్తే..
ప్లస్ పాయింట్స్ : సంగీతంకామెడీసాయి తేజ్ – రాశీఖన్నా జంటరెండు పాటలుజయకుమార్ సినిమాటోగ్రఫీథమన్ నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్ : బలమైన ఎమోషన్స్ లేకపోవడం, ఊహించదగ్గ కథనం, మారుతి రొటీన్ టేకింగ్ ఎమోషన్స్ ను కామెడీ డామినేట్ చేయడం తో పండని ఎమోషన్, ఫలితంగా సినిమా పక్కదారి పట్టేసింది. సినిమా కలెక్షన్స్ అన్న సినిమా కు ఊరటనిస్తాయేమో చూడాలి.
దక్షిణాది హీరోలపై హీరోయిన్ కామెంట్స్