ప్రస్తుతం టీవీ షోలకు పరిమితమైన హీరోయిన్ నేహా ధూపియా రీసెంట్గా దక్షిణాది సినిమాల గురించి మాట్లాడుతూ దక్షిణాదిలో హీరో కంటే హీరోయిన్ను తక్కువగానే చూస్తారని చెప్పింది. “చాలా ఏళ్ల క్రితం నేను ఓ దక్షిణాది సినిమాలో నటించేటప్పుడు నిర్మాతలు ముందుగా హీరోకే భోజనాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు నేను చాలా ఆకలితో ఉన్నా. అయినా కూడా నిర్మాతలు హీరోకే భోజనాన్ని అందించారు. అది చూసి నేను నవ్వుకున్నాను. నన్ను ఏమాత్రం బాధించలేదు. ఇది చాలా ఏళ్ల క్రితం జరిగింది” అన్నది నేహా ధూపియా. ఈమె తెలుగులో ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘విలన్’, ‘పరమవీరచక్ర’ చిత్రాల్లో నటించారు. మరి ఈమె ఏ సౌత్ హీరోను టార్గెట్గా చేసిందో తెలియడం లేదు. దక్షిణాదిలో నటించిన కొందరు బాలీవుడ్ భామలు కొన్ని రోజుల తర్వాత దక్షిణాది సినిమాలపై కామెంట్ చేయడమనేది కామన్గా మారింది. తాప్సీ, ఇలియానా ఇలా అందరూ సౌత్ హీరోలు, డైరెక్టర్స్ను ఏదో ఒక మాట అన్నవారే. ఇప్పుడు ఈ లిస్టులో బాలీవుడ్ సుందరి నేహా ధూపియా చేరింది.
next post