telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల్లు అర్జున్‌ పుష్పాకు బ్రేక్..!

Pushpa

అల్లుఅర్జున్ పాన్ ఇండియా రేంజ్‌లో చేస్తున్న సినిమా పుష్పా అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో రష్పికా మందానా కథానాయికగా ఓ తండా వాసినిగా కనిపించనుంది. దీనితో పాటుగా ఈ సినిమాతోనే అల్లు అర్జున్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేయనున్నాడన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ను నిలిపివేవారన్నారు. దాంతో పుష్పా నిలిచిపోయిందా అని అభిమానులు నిరాశ చెందా. దానికి అసలు కారణం కూడా తెలీక వారు ఆలోచనలలో పడ్డారు. అయితే చిత్రీకరణ సిబ్బందిలో కొందరు కరోనా లక్షణాలతో ఉండే సరికి ఎటువంటి సమయం వృధా చేయకుండా చిత్రయూనిట్ షూటింగ్‌ను ఆపివేసింది. వెంటనే అందరూ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం మొదలు పెట్టారని సమాచారం. ఈ సినిమా ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని మారేడుమల్లి అడవుల్లో చిత్రీకరణను పూర్తిచేసుకొని, వారణాసి, కాశీకు బయలుదెరింది. అయితే అక్కడ ఇలా జరగడంతో దర్శకుడు కొన్నాళ్లు షూటింగ్‌ను ఆపాలని నిర్ణయించుకున్నాడు. అయితే తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనేదానిపై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

Related posts