సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `దర్బార్`. సంక్రాంతి సందర్భంగా సినిమాను జనవరి 9న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదలను ఆపాలంటూ మలేషియాకు చెందిన డీఎంవై క్రియేషన్స్.. `దర్బార్` విడుదలను అపాలంటూ కేసు వేసింది. `2.0` సమయంలో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తీసుకున్న రూ.12 కోట్ల అప్పు కాస్త ఇప్పుడు వడ్డీతో కలిపి రూ.23 కోట్లు అయ్యిందని అప్పు చెల్లించే వరకు సినిమా విడుదలను ఆపాలంటూ సదరు సంస్థ మద్రాసు కోర్టులో కేసు వేసింది. దీనిపై మంగళవారం మధ్యాహ్నం లోపు వివరణ ఇవ్వాలంటూ కోర్టు లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధుల కోరింది. అయితే లైకా ప్రతినిధులు `దర్బార్` విడుదలకు ఇవేవీ అడ్డంకులు కావని అంటున్నారు. దర్బార్ విడుదలకు వ్యతిరేకంగా కేసు వేసిన మలేషియా సంస్థ తప్పుడు కేసు వేసిందని వారు ఆరోపిస్తున్నారు. త్వరలోనే కేసుకు సబంధించిన అధికారిక వివరణను లైకా సంస్థ ఇవ్వనుందట.
previous post
next post