గుజరాత్కు చెందిన మాజీ ఎమ్మెల్యే జయంతీలాల్ భానుషలీ రైలులో దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయనను తుపాకీతో కాల్చి చంపారు. భుజ్ నుంచి అహ్మదాబాద్ వెళ్లే సజయీ నగరీ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న సమయంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా, అబుదాస నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన జయంతీలాల్ భానుషలీపై అత్యాచార ఆరోపణలు ఉన్నాయి.
గతంలో జయంతీలాల్ తనపై అకృత్యానికి పాల్పడ్డారంటూ సూరత్కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే డబ్బు కోసమే తన భార్య ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసిందంటూ ఆమె భర్త పేర్కొనడంతో ఈ కేసుపై అనుమానాలు నెలకొన్నాయి. కాగా వ్యక్తిగత పగతోనే దుండగులు జయంతీలాల్ను హత్య చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ లభించిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ షికార్లు: కోదండరాం