telugu navyamedia
సినిమా వార్తలు

మెగా అభిమానులకు శుభవార్త… తెరపైకి పవన్, చరణ్ సినిమా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం వల్ల సినిమాలకు దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో పవన్ సైతం ఓటమి పాలయ్యాడు. దీంతో పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారనే వార్తలు ప్రచారం అయ్యాయి. వీటిపై స్పందించిన పవన్ కళ్యాణ్ తాను ఇకపై కూడా రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మూడేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ నిర్మాణంలో రామ్ చ‌ర‌ణ్‌ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపొంద‌నుంద‌ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో అందరూ ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన వార్తలు రాలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్ మ‌రోసారి వార్త‌ల‌లోకి వ‌చ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న మిత్రుడు త్రివిక్ర‌మ్‌కి మంచి క‌థ‌ని రెడీ చేయ‌మ‌ని చెప్పార‌ట‌. ఆ చిత్రం చ‌ర‌ణ్ హీరోగా రూపొందిస్తాన‌ని కూడా అన్నాడ‌ట‌. అంతా అనుకున్నట్టుగా జరిగితే 2020లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌డం ఖాయ‌మంటున్నారు. ఈ చిత్రాన్ని ప‌వ‌న్ త‌న సొంత బేన‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్‌పై రూపొందించ‌నున్నారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉండ‌గా, త్రివిక్ర‌మ్, బ‌న్నీ 19వ‌చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

Related posts