“బాహుబలి” చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సాహో”. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, చుంకీ పాండే, లాల్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ తప్పుకున్న తర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. “సాహో” చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాల భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇక చిత్ర రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ వినూత్నమైన ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్తో పాటు పోస్టర్స్, సాంగ్స్ విడుదల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అభిమానులు ఎప్పుడా ఎన్నడా అంటూ ఎదురు చూస్తున్న సాహో ట్రైలర్ వచ్చేసింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రభాస్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా విడుదలైన సాహో ట్రైలర్ సినిమా పై అంచనాలని భారీగా పెంచేసింది. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, ప్రభాస్, శ్రద్ధా కపూర్ల రొమాన్స్తో పాటు నేపథ్య సంగీతం కూడా బాగుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఈ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ని షేక్ చేయబోతున్నట్టు తాజాగా విడుదలైన ట్రైలర్ని చూస్తే అర్థమవుతోంది. మీరు కూడా ఈ యాక్షన్ థ్రిల్లర్ ను వీక్షించండి.