telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీ ప్రభుత్వానికి … 100 కోట్ల జరిమానా..

100 cr penalty to ap govt by national tribunal

నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చింది. ఏకంగా రూ. 100 కోట్ల జరిమానా విధించింది. కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఈ జరిమానా విధించింది. ప్రతిరోజు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు నదిలో ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారని గ్రీన్ ట్రైబ్యునల్ కు కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు నివేదికను అందించాయి.

ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ వాటర్ మేన్ రాజేంద్ర సింగ్, అనుమోలు గాంధీలు గ్రీన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన ట్రైబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి రూ. 100 కోట్ల జరిమానా విధించింది.

ఇంకొన్ని వార్తలు చదవండి..

Related posts