వరద నీటి ఉధృతి పెరుగుతుండడంతో అధికారులు ఏపీలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 6లక్షల క్యుసెక్కులు. వంశధారనదికి వరద ఉధృతి పెరిగింది. గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇన్ ఫ్లో 81,354 క్యుసెక్కులు,అవుట్ ఫ్లో 68,632 6 క్యుసెక్కులుగా ఉంది.
వరద ఉధృతి దృష్ట్యా అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. సహాయక బృందాలకు సహకరించాలని విపత్తుల శాఖ కమీషనర్ విజ్ఞప్తి చేసింది. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయరాదని తెలిపింది. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సూచించారు.