లాక్డౌన్ ప్రభావంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉంటూనే తమ అభిమానులతో సోషల్ మీడియా ద్వారా టచ్లో ఉంటున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా రోజూ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో టచ్లో ఉంటున్నారు. దాదాపు పదిహేనేళ్లపాటు వెండితెరపై అగ్రకథానాయికగా కొనసాగింది. దక్షిణాదిన తమిళ, తెలుగు భాషల్లో అగ్ర హీరోయిన్గా వెలుగొందిన ఈ బ్యూటీ పలువురు అగ్ర హీరోల సినిమాల్లో నటించింది. దక్షిణాదితో పాటు బాలీవుడ్లో కూడా తన సత్తా చాటాలనుకుంది. `హిమ్మత్వాలా`తో గట్టి ప్రయత్నమే చేసింది. అయితే ఆ సినిమా పరాజయం పాలవడంతో తమన్నాకు హిందీ నుంచి అవకాశాలు రాలేదు. తాజాగా ఆ సినిమా గురించి తమన్నా మాట్లాడింది. “హిమ్మత్వాలా` సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టాను. కెరీర్ పరంగా ఆ సినిమా నాకు గట్టి ఎదురుదెబ్బ. ఆ సినిమా పరాజయం పాలైంది. ఒకేసారి నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉండడం వల్ల `హిమ్మత్వాలా`పై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోయాను. అయితే ఆ సమయంలో ఆ పరాజయం గురించి ఎక్కువ ఆలోచించడం కుదరలేదు. అప్పటికి నేను పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉండేదాన్ని. సినిమా ఫలితం గురించి ఆలోచించే సమయం ఉండేది కాదు” అని తమన్నా తెలిపింది.
previous post
next post