ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీ అనారోగ్యానికి గురైన హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి, జగన్ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు పోసానిని పరామర్శించారు.
ఇతర వైసీపీ నేతలతో కలిసి యశోదా ఆసుపత్రికి వెళ్లిన సజ్జల పోసాని ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోసాని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.