telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రంగ్ దే : సురక్షితంగా మరో షెడ్యూల్ పూర్తి

rang-de

యంగ్ హీరో నితిన్ ఇటీవల ‘భీష్మ’ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే జోష్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా పట్టాలెక్కించాడు నితిన్. ‘మహానటి’ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘రంగ్ దే’ ఫస్ట్ లుక్ మరియు నితిన్ మ్యారేజ్ నాడు రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోకి మంచి స్పందన వచ్చింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. కోవిడ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలె తిరిగి ప్రారంభమైంది. లాక్‌డౌన్‌కు ముందే ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం పూర్తయింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తాజాగా మరో షెడ్యూల్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నితిన్ ట్విటర్ ద్వారా తెలియజేశాడు. “రంగ్ దే”కి సంబంధించి మరో షెడ్యూల్ షూటింగ్ సురక్షితంగా, ఉత్సాహంగా పూర్తయ్యింది” అని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

Related posts