మరోసారి పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడింది శ్రీరెడ్డి. గత కొంతకాలం నుంచి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి ఈ ఎన్నికల వేళ మరోసారి మెగా ఫ్యామిలీపై విమర్శల వర్షం కురిపించింది. “అరే పవన్.. నీ స్థాయి ఏంటి..?” అంటూ పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. ఈ వీడియో ను చూసిన నెటిజన్లు కొంతమంది శ్రీరెడ్డికి సపోర్ట్ చేస్తుండగా… పవన్ అభిమానులు మాత్రం శ్రీరెడ్డిపై మండిపడుతున్నారు.
సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎన్నికల ప్రచారంలో పవన్ “అలీ తనకు స్నేహితుడైనా జగన్ తో చేతులో కలిపి తనను మోసం చేశాడని అన్నారు. అలీ చెప్పిన వాళ్లకు జనసేన తరఫున టికెట్ ఇచ్చినా… తనను వదిలి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అలీ కష్టాల్లో ఉన్నప్పుడు తను అండగా ఉన్నానని, కానీ ఇప్పుడు అతడు వైసీపీలోకి వెళ్లిపోయారని నటుడు అలీపై సంచనల చేశారు. ఈ విషయంపై స్పందించిన అలీ “మీరు ఏ విధంగా సాయపడ్డారు పవన్ సర్..” అంటూ పవన్ కి కౌంటర్ గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోపక్క శ్రీరెడ్డి కూడా పవన్ పై విరుచుకుపడింది.