‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ఈ వెంట్లో పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సినీ పరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. మంత్రులంతా సన్నాసులు అంటూ పవన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు.. మంత్రులందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్పై విరుచుకుపడుతున్నారు.
అలాగే ‘మా’ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేయడం సినీ పరిశ్రమలో హాట్ టాఫిక్గా మారింది. ఆయన మాటలను పలువురు సమర్థిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నే జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ట్వీట్టర్ వేదికగా భీకరంగా సాగుతోంది. నోటికొచ్చిన భాషను ట్విట్టర్ పోస్టుల్లో నింపేస్తున్నారు నేతలు.
తాజాగా…వైసీపీ నేతలు చేస్తున్న మూకుమ్మడి కామెంట్స్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలన ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలసీ ‘ఉగ్రవాదం’ అంటూ మండిపడ్డారు. ఈ విధానలతో రాష్ట్రంలోని అన్ని రంగాుల, వర్గాలు నాశనం అయిపోయాయని ఫైర్ అయ్యారు. ఈ ఉగ్రవాద పాలసీని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు. ఈ వార్ చూస్తుంటే ఇప్పట్లో చల్లబడేలా కనిపించడం లేదు.. ఇక దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో మరి వేచి చూడాలి.
వైసీపీ ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం' కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది..
— Pawan Kalyan (@PawanKalyan) September 28, 2021