telugu navyamedia
సినిమా వార్తలు

క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా నిత్యామీనన్ 50వ సినిమా

NItyamenon

విభిన్నమైన సినిమాలతో పలు భాషల్లో సినిమాలు చేస్తూ నటిగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న నటి నిత్యామీనన్. ఈ ముద్దుగుమ్మ కమర్షియల్ సినిమాలకు దూరం. పాత్ర వైవిధ్యంగా ఉండి తనకు నచ్చితేనే సినిమా చేస్తుంది. లేదంటే ఏమాత్రం మొహమాటం లేకుండా సినిమా చేయనని చెప్పేస్తుంది. అయితే ఇటీవలే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది నిత్యా. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన “మిషన్ మంగళ్” సినిమాలో ఒక కీలకపాత్రలో నిత్య నటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల‌లో న‌టించిన నిత్యా త‌న కెరీర్‌లో స‌క్సెస్‌ఫుల్‌గా 50 చిత్రాలు చేసింది. 1998లో “ది మంకీ హూ న్యూ టూ మ‌చ్” అనే చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెర‌కి పరిచ‌య‌మైన నిత్యామీన‌న్ త‌న 50వ చిత్రంగా “అర‌మ్ తిరుక‌ల్ప‌న” అనే చిత్రం చేస్తుంది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో మాలీవుడ్ న‌టుడు షైన్ టామ్ చాకో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. అజ‌య్ దేవ‌లోక ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఈ చిత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కి మించి ఉంటుంద‌ని అంటున్నారు. నిత్యామీన‌న్ రీసెంట్‌గా అక్ష‌య్ కుమార్ చిత్రం మిష‌న్ మంగ‌ళ్‌తో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక తెలుగులో చివ‌రిగా ఎన్టీర్ క‌థానాయ‌కుడు, గీతా గోవిందం చిత్రాల‌లో మెరిసింది. ఈ సినిమా గురించి నిత్యా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts