అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. 90లలో లేడీ సూపర్స్టార్గా అద్భుతమైన స్టార్డమ్ సంపాదించిన విజయశాంతి మళ్ళీ 13 ఏళ్ళ తర్వాత “సరిలేరు” నీకెవ్వరు అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ సినిమాపై ఆమె అభిమానులలో చాలా ఆసక్తి నెలకొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.
మాస్ మహేష్ బాబు మండేస్ పేరుతో ప్రతీ సోమవారం సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఇస్తున్నారు చిత్రయూనిట్. ఈ సోమవారం సినిమాలో రష్మిక, మహేష్ను టీజ్ చేస్తున్న సందర్భంలో వచ్చే ఓ సాంగ్ను రిలీజ్ చేశారు. హీ ఈజ్ సో క్యూట్ అంటూ సాగే ఈ పాటకు గతంలో రిలీజ్ చేసిన పాటల కంటే మంచి రెస్సాన్స్ వచ్చింది. దీంతో చిత్రయూనిట్ ఆనందంగా ఉన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మిక, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ను ఉద్దేశిస్తూ `మన కాంబినేషన్ను మరింత పెద్దదిగా చేద్దాం సార్` అంటూ ట్వీట్ చేసింది. అయితే ట్వీట్తో చివరల్లో ఓ కోతి బొమ్మను యాడ్ చేసింది రష్మిక. ఈ ట్వీట్పై స్పదించిన దేవీ శ్రీ `సరే.. మన కాంబినేషన్ను క్యూట్, స్వీట్, ఆసమ్గా చేద్దాం. కానీ నువ్వు నా పేరు చివర కోతి బొమ్మ ఎందుకు పెట్టావ్. నువ్వు దీనికి సమాధానం చెప్పాలి` అంటూ రిప్లై ఇచ్చాడు. దేవీ రిప్లైపై స్పందించిన రష్మిక `ఆ సీక్రెట్ ఏంటో మనం కలిసినప్పుడు నేను మీకు మాత్రమే చెప్తా` అంటూ ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో రష్మిక ట్వీట్ వైరల్గా మారింది. దేవీ శ్రీ, రష్మిక మధ్య ఏం జరిగింది. రష్మిక ఎందుకు అలా ట్వీట్ చేసిందో తెలుసుకునేందుకు ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
Hahahaha yaa lets ROCK !! Lets make it CUTE, SWEET & AWESOME !! 😀😀😀
Btw , Why did u put a Monkey 🐒 next to “dsp saaaar” ?!?! 😜😜
U must answer nowww😂 https://t.co/cxUhv4OLaz
— DEVI SRI PRASAD (@ThisIsDSP) December 16, 2019