సీనియర్ నటి పవిత్ర లోకేష్ కర్ణాటక మైసూర్లోని సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తన పేరుతో కొందరు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచారని, అంతటితో ఆగకుండా తన పేరుప్రతిష్టలకు భంగం కలిగించేలా ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారంటూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఫేక్ అకౌంట్ల ద్వారా తన గురించి అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఆమె ఆరోపణల మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దీనిపై విచారణ చేపడుతున్నారు.
కన్నడ నటిగా పేరుతెచ్చుకున్నా పవిత్రా లోకేష్ ..1995లో కన్నడ సినిమా ‘మిస్టర్ అభిషేక్’తో తెరంగేట్రం చేసిందామె. తెలుగులో కూడా అనేక సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లోనే.. స్టార్ హీరో హీరోయిన్లకు తల్లిగా, అత్తగా ఆమె నటించి మెప్పించింది.
2007లో కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్ను వివాహం చేసుకున్న ఆమె.. ప్రముఖ తెలుగు నటుడు నరేశ్తో లివింగ్ రిలేషన్ లో ఉందని, త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
కొన్నాళ్ల కిందట నరేశ్ ఫ్యామిలీ ఫంక్షన్లో సందడి చేసిన ఆమె.. ఇటీవలే ఆయనతో కలిసి మహాబలేశ్వర ఆలయానికి కూడా వెళ్లారు. దీనిపై అటు నరేశ్ కానీ, ఇటు పవిత్ర కానీ ఇంతవరకు స్పందించనేలేదు.