telugu navyamedia
సినిమా వార్తలు

సైబర్‌ పోలీసుకు సీనియర్‌ నటి ఫిర్యాదు..

సీనియర్ నటి పవిత్ర లోకేష్‌  కర్ణాటక మైసూర్​లోని సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. తన పేరుతో కొందరు సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచారని, అంతటితో ఆగకుండా తన పేరుప్రతిష్టలకు భంగం కలిగించేలా ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారంటూ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ ఫేక్‌ అకౌంట్ల ద్వారా తన గురించి అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఆమె ఆరోపణల మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దీనిపై విచారణ చేపడుతున్నారు.

Pavitra Lokesh Lodges Complaint With Mysore Cyber Police - Sakshi

కన్నడ నటిగా పేరుతెచ్చుకున్నా పవిత్రా లోకేష్ ..1995లో  కన్నడ సినిమా ‘మిస్టర్​ అభిషేక్’​తో తెరంగేట్రం చేసిందామె. తెలుగులో కూడా అనేక సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లోనే.. స్టార్ హీరో హీరోయిన్లకు తల్లిగా, అత్తగా ఆమె నటించి మెప్పించింది.

2007లో కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్​ను వివాహం చేసుకున్న ఆమె.. ప్రముఖ తెలుగు నటుడు నరేశ్​తో లివింగ్ రిలేషన్ లో ఉందని, త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

 ఇటీవలే ఈ జంట మహాబలేశ్వరం టెంపుల్ లో పెళ్ళికి సంబంధించిన పనులను కూడా చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై పవిత్రా లోకేష్ స్పందించారు.నరేష్‌తో తాను సహజీవనం చేస్తున్న మాట వాస్తవమేనని పవిత్ర పేర్కొంది.

 

కొన్నాళ్ల కిందట నరేశ్​ ఫ్యామిలీ ఫంక్షన్​లో సందడి చేసిన ఆమె.. ఇటీవలే ఆయనతో కలిసి మహాబలేశ్వర ఆలయానికి కూడా వెళ్లారు. దీనిపై అటు నరేశ్‌ కానీ, ఇటు పవిత్ర కానీ ఇంతవరకు స్పందించనేలేదు.

 

 

 

 

 

Related posts