జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హీరో నందు ఓ పాటను డైరెక్ట్ చేశాడు. ఇందులో సింగర్ పర్ణిక మాన్య అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. అందరికీ నమస్తే. ‘మా వార్తలు మా ఇష్టానికి’ స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. పర్ణికా మాన్య మీ అందరి కోసం ఒక మంచి పాట చేసింది. ఇప్పుడు అది మీ అందరి కోసం వేస్తం చూడుండ్రి.. ఎంజాయ్ చేయిండ్రి.. అంటూ మొదలయ్యే ఈ పాటను తెలంగాణ యాసలో పాడింది పర్ణికనే. మ్యూజిక్, లిరిక్లతో అదరగొట్టింది మాత్రం సింగర్ నోయెల్. పాట పూర్తయ్యే వరకు పర్ణిక డ్యాన్స్ అదరగొట్టింది. ఈమె పర్ఫామెన్స్కు అందరూ ఫిదా అవుతున్నారు. ఎప్పుడూ పాటలతో మంత్రముగ్దుల్ని చేసే పర్ణిక ఈసారి కాలు కదిపింది. ఈ పాటలో ఒక్కోసారి పర్ణిక మహానటి కీర్తి సురేశ్లా ఉందని ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. సింగర్ నోయెల్ ఈ పాటను కంపోజ్ చేశాడు. ఇప్పుడు ఈ పాట సోషల్మీడియాలో వైరల్గా మారింది. మీరు కూడా ఈ వీడియో సాంగ్ ను వీక్షించండి.
previous post
next post
“సాహో” రిజల్ట్ పై ప్రభాస్ స్పందన