telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

”జాతిరత్నాలు” పై మహేష్ ట్విట్…

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా’తో తెలుగులో అరంగేట్రం చేసిన నవీన్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా నవీన్ పోలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘జాతి రత్నాలు’. ఈ సినిమా ఈ నెల11న విడుదలై దూసుకపోతుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లాహ్ హీరోయిన్‌గా నటించింది . ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాను అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా పై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించాడు. మహేష్ బాబు ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో నవీన్ పొలిశెట్టి నటించారు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ… ‘నవీన్ పొలిశెట్టి ఎంతో కష్టపడే తత్వం’ ఉన్న నటుడు అని మహేష్ అన్నాడు. ‘వన్ నేనొక్కడినే’ మూవీ టైంలో నవీన్‌తో మాట్లాడిన మాటలన్నీ గుర్తున్నాయి అంటూ మహేష్ ట్వీట్ చేశారు. నవీన్ పొలిశెట్టి రిప్లైగా.. ‘మిమ్మల్ని చూస్తూ ఉన్న ప్రతీ క్షణం ఏదో ఒకటి నేర్చుకున్నాను, అవన్నీ ఇప్పటికీ గుర్తున్నాయి సర్’ అంటూ పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పూయిస్తూనే ఉంది.

Related posts