రేణు దేశాయ్ పరిచయం అక్కర్లేని పేరు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే కాకుండా మంచి నటిగా తెలుగు ప్రేక్షకులకు రేణు సుపరిచితురాలే. బద్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మరాఠీ.. ఆనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. పవన్ తో తప్పా మరో హీరోతో సినిమా చేయలేదు. జానీ సినిమా తరువాత పవన్ ను వివాహం చేసుకున్నది. అయితే పవన్ తో విడిపోయిన తరువాత రేణూదేశాయ్ తన రెండవ పెళ్ళికి సంబంధించిన వార్తలతో హాట్ టాపిక్ గా నిలిచింది. ఆ సమయంలో పవన్ అభిమానుల ట్రోలింగ్ కు గట్టిగానే సమాధానం చెప్పింది. ఇక తనను తాను దర్శకురాలిగానే కాకుండా నటిగానూ నిరూపించుకోడానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతోంది. అయితే ఇప్పుడు తాను వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఇటీవల విడుదలైన ‘చూసీ చూడంగానే’ చిత్రంలో తల్లి క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆరోగ్య సమస్య వలన తాను సినిమాలో నటించలేకపోయింది. పవన్ తాజా చిత్రం పింక్ రీమేక్లో ఓ చైల్డ్ ఆర్టిస్ట్కి తల్లిగా రేణు దేశాయ్ కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బద్రి, జానీ చిత్రాలలో కలిసి నటించిన పవన్, రేణూదేశాయ్లని మళ్ళీ ఈ సినిమాలో చూపించే ప్రయత్నం దర్శకుడు వేణు శ్రీరామ్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే.
previous post
next post