ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రం 350కి పైగా కలెక్షన్లను సాధించింది. డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికి భారీ వసూళ్ళు సాధించడం చిత్ర బృందానికి సంతోషాన్నిచ్చింది. ఇక బాలీవుడ్లో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించి వంద కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. అయితే సాహో సినిమా రిజల్ట్ పై చిత్ర యూనిట్ సభ్యులు చాలా వరకు సైలెంట్ గానే ఉన్నారు. విడుదలైన నాలుగురోజుల అనంతరం ఒకొక్కరు సినిమా రిజల్ట్ పై స్పందిస్తున్నారు. ఇప్పటికే సుజిత్ తన వివరణ ఇవ్వగా ఇప్పుడు కథానాయకుడు ప్రభాస్ కూడా తన వివరణ ఇచ్చాడు. “డియర్ ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్ “సాహో”పై మీరు చూపించిన ప్రేమ అభిమానానికి చాలా కృతజ్ఞతలు మీ వల్లే ఈ సినిమా మంచి గుర్తింపు దక్కింది” అని సింపుల్ కామెంట్ తో ఆన్సర్ ఇచ్చాడు. సినిమా విడుదలకు ముందు భారీ స్థాయిలో ప్రమోషన్స్ లో పాల్గొన్న చిత్ర యూనిట్ సినిమా విడుదల అనంతరం చాలా వరకుప్రమోషన్స్ తగ్గించేసింది.
previous post