telugu navyamedia
సినిమా వార్తలు

నాగశౌర్య కొత్త చిత్రానికి క్లాసిక్ టైటిల్

Naga-Shourya

యంగ్ హీరో నాగ‌శౌర్య‌ “ఊహ‌లు గుస‌గుస‌లాడే” సినిమాతో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. 2018లో ఛ‌లో చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్న నాగ‌శౌర్య ఆ త‌ర్వాత క‌ణం, అమ్మ‌మ్మ‌గారిల్లు, న‌ర్త‌న‌శాల వంటి చిత్రాలతో వరుస ఫ్లాపులు మూట‌గ‌ట్టుకున్నాడు. ఇటీవల “ఓ బేబి” చిత్రంతో ప్రేక్ష‌కుల‌ ముందుకు వచ్చాడు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించిన‌ప్ప‌టికి ఆ క్రెడిట్స్ అన్నీ స‌మంత‌కే ద‌క్కాయి. అయితే లేడి డైర‌క్ట‌ర్ ల‌క్ష్మీ సౌజ‌న్య ద‌ర్శ‌క‌త్వంలో నాగ శౌర్య యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని చేనుండ‌గా, ఈ చిత్రానికి “మూగ మ‌న‌సులు” అనే క్లాసిక్ టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై రూపొంద‌నున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ నుండి సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. వ‌చ్చే ఏడాది మేలో విడుద‌ల కానుంది. చిత్ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

Related posts