తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బోర్డ్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా నే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు, విమర్శలు ఇంటర్ బోర్డ్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రీ కౌంటింగ్ ఫలితాల పై కూడా నేడు హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఇంకా అలాంటి వ్యవహారాలు సద్దుమణగకముందే ఇంటర్ బోర్డు మరో తప్పిదం చేసింది.
ఒకే విద్యార్థికి రెండు హల్ టికెట్లు జారీ చేసింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన వినోద్ అనే విద్యార్థి ఈ నెల 12న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నాడు. అయితే వినోద్కు రెండు హాల్ టికెట్లు, రెండు వేర్వేరు కేంద్రాలు వచ్చాయి. దీంతో ఎక్కడ పరీక్ష రాయాలో తెలియక ఆ విద్యార్తీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.