telugu navyamedia
రాజకీయ వార్తలు విద్యా వార్తలు

గాంధీ ఆత్మహత్య చేసుకున్నారా.. రేపటి తరానికో ప్రశ్న..

how gandhiji suicide is a question to

గుజరాత్ లోని గాంధీనగర్ లోని సుఫలాంశల వికాస్ సంకుల్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో ఎవరూ అడగని విచిత్రమైన ప్రశ్న అడిగారు. ఈ సందర్భంగా గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు? అంటూ ఓ ప్రశ్న ఇచ్చారు. ఈ ప్రశ్న చూసి విద్యాశాఖ అధికారులే నివ్వెరపోయారు. గాంధీని చంపింది గాడ్సే అని లోకమంతా తెలుసు. కానీ ఆ ప్రశ్న ఇచ్చిన విద్యావేత్తలకు తెలియకపోవడమే అత్యంత విచారకరం! పైగా, గాంధీ పుట్టిన గుజరాత్ లోనే ఇలాంటి ప్రశ్న పుట్టుకొచ్చిందంటే అది ఆ మహనీయుడికి ఖచ్చితంగా అవమానమే!

ఇలాంటిదే ప్లస్ టూ విద్యార్థులకు మరో ప్రశ్న ఎదురైంది…మీ ప్రాంతంలో మద్యం అమ్మకాలు మరింత పెరగాలంటే ఏంచేయాలో పోలీసు ఉన్నతాధికారికి లేఖ రాయండంటూ ప్రశ్న అడిగారు. ఈ తప్పిదాలను గాంధీనగర్ జిల్లా విద్యాశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. బాధ్యులపై చర్యలకు విచారణకు ఆదేశించారు.

Related posts