telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైతుల భూములు వెంటనే వెనక్కు ఇవ్వాలి: వల్లభనేని వంశీ

Vamsi

రైతుల భూములను వెంటనే వెనక్కు ఇవ్వాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలెక్టర్ ను కోరారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాపురం గ్రామ రైతులకు అండగా ఉంటానని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, చిన్న, సన్నకారు రైతుల భూముల్లో రెవిన్యూ అధికారులు ప్రభుత్వ స్థలం అని బోర్డులు పెట్టి స్వాధీనం చేసుకోవడంపై ఆయన స్పందించారు.

రైతులు స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్దకు రావాలని పిలిపించారు. అనంతరం వారి నుంచి వివరాలను సేకరించి జిల్లా కలెక్టర్ అహ్మద్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ ఎవరూ దిగులు పడొద్దని ధైర్యం చెప్పారు. రైతులందరికీ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Related posts