telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు: సీఎం జగన్

cm jagan ycp

సంస్కరణల జ్ఞాని, తెలుగుజాతి ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుక సందర్భంగా ఏపీ సీఎం జగన్ స్పందించారు. పీవీ నరసింహారావు గారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుందాం అంటూ ట్వీట్ చేశారు.

ఎంతో వివేకవంతుడైన రాజకీయవేత్త, బహుభాషా కోవిదుడు అయిన రావు గారు జాతిని ఆర్థిక స్వేచ్ఛగా నడిపించారని కొనియాడారు. దేశాన్ని పురోభివృద్ధి దిశగా నడిపించే క్రమంలో ఆయన అందించిన సేవలను భావి తరాలు కూడా గుర్తుంచుకుంటాయని జగన్ పేర్కొన్నారు.

Related posts