telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కంగనా చెంప పగలగొడతామన్న శివసేన నేత… జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఫైర్

Kangana

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ లోని పలువురుపైన చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలో శివసేన ఎంపి సంజయ్ రౌత్ తనను బెదిరించారని కంగానా తన ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ముంబైని పీఓకేతో పోల్చే వారికి పీఓకే గురించి ఏమీ తెలియదని చెప్పారు. ముంబైని కానీ, మహారాష్ట్రను కానీ కించపరుస్తూ మాట్లాడితే తాము సహించబోమని అన్నారు. ఆమె వెనుక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయని ఆరోపించారు. దీంతో కంగనా, సంజయ్ రౌత్ మధ్య వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కంగనా రనౌత్ ముంబైలో అడుగుపెడితే మహిళలు చెంప పగలగొడతారని శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ప్రతాప్ మాట్లాడుతూ, ముంబైలో నివసించే అర్హత కంగనకు లేదని చెప్పారు. కంగనకు తమ ఎంపీ సంజయ్ రౌత్ ఒక చిన్న హెచ్చరిక జారీ చేశారని… ఒకవేళ ఆమె ముంబైకి వస్తే ధైర్యవంతులైన తమ పార్టీ మహిళలు ఆమె చెంప పగలగొట్టకుండా ఉండరని అన్నారు. ముంబై పోలీసులను కించపరిచేలా మాట్లాడిన కంగనాపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతాప్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా నాయక్ మండిపడ్డారు. ప్రతాప్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేయాలని ట్వీట్ చేశారు.

Related posts