*ఎట్టకేలకు ఒక్కటైన నయన్ అండ్ విఘ్నేష్..
*ఏడేళ్ళుగా సాగిన వీరి ప్రేమ కథకు.. పెళ్ళితో ఒక్కటైయ్యారు
*సౌత్ లో జరిగిన అతిపెద్ద స్టార్ మ్యారేజ్ ఇదే..
*తారల సందడితో తళుకులీలన నయన్ పెళ్ళి వేదిక
ఏడేళ్ళుగా రిలేషన్లో ఉన్న లవబర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్ ఏడడుగులు, మూడు ముళ్ల బంధం వివాహతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి ఈ రోజు ఉదయం 8.30 గంటలకు షెరటాన్ గ్రాండ్, మహాబలిపురంలో షెరటాన్ గ్రాండ్లో అత్యంత బంధువులు, సన్నిహితులు మధ్యఘ నంగా జరిగింది.
వీరి పెళ్లికి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ , బోనీకపూర్, రజినీకాంత్, చిరంజీవి, తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్, నటుడు ఎస్ జే సూర్య, విజయ్ సేతుపతి , కార్తీక్ సహా పలువురు అతిరథ మహారథులు హాజరయ్యారు. వీరి పెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగింది.
మొదట్లో తిరుపతిలో పెళ్ళి చేసుకోవాలనుకున్నారు..కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మహాబలిపురంలో షిప్ట్ చేసుకున్నారు.
కాగా పెళ్లికి కొద్ది క్షణాల ముందు విఘ్నేశ్ శివన్ నయన్పై ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తను వధువుగా ముస్తాబై వివాహ వేదికపై నడుచుకుంటూ వస్తుంటే చూడాలని ఆతృతుగా ఎదురు చూస్తున్నానంటూ కాబోయో భార్య గురించి ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు విఘ్నేశ్.
ఈ సందర్భంగా తన ఆనందాన్ని, ప్రేమను నయన్కు అంకితం ఇస్తున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు విఘ్నేశ్.