telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

‘కదిలే కాలాన్నడిగా’ అంటున్న కార్తికేయ…

టాలీవుడ్‌ లో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో కార్తికేయ. అయితే ఇప్పుడు కార్తికేయ హీరోగా తెరకెక్కతున్న సినిమా చావుకబురు చల్లగా. ప్రస్తుతం మంచి బజ్ ఉన్న సినిమాల్లో ఇది ఒక్కటి. ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్‌లు, టీజర్, పాటలు అన్నీ కూడా సినిమాపై అంచనాలను అంతకు అంతా పెంచాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో లిరికల్ పాట విడుదలైంది . ‘కదిలే కాలాన్నడిగా’ అంటూ సాగే పాట అభిమానుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో లావణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా చేస్తున్నారు. అయితే ఈ మూవీలో కార్తికేయ ‘బ‌స్తీ బాల‌రాజు’,  లావణ్య త్రిపాఠి ‘మల్లిక’ పాత్ర‌ల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కౌషిక్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పిస్తుండగా బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇందులో బుల్లితెర బ్యూటీ అనసూయ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి19న ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి ఈ సినిమా అభిమానులను మెప్పిస్తుందా.. వారు సినిమా పై పెట్టుకున్న అంచనాలను అందుకుంటుందా… లేదా అనేది.

Related posts