బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఓ బయోపిక్ రూపొందనున్న విషయం తెలిసిందే. టీ సిరీస్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ బయోపిక్కు అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సైనా పాత్రలో నటించనున్న పరిణీతి ఇప్పుడు బ్యాడ్మింటన్ నేర్చుకుంటోంది. పరిణితీ చోప్రా గతంలో నాలుగు నెలలపాటు బ్యాడ్మింటన్ ప్రాక్టీసు చేస్తూ గాయపడ్డారు. మెడకు గాయమవడంతో కొన్నాళ్లు షూటింగుకు దూరంగా ఉన్న పరిణితీ కోలుకొని తిరిగి షూటింగులో పాల్గొన్నారు. రామశేతు ఠాకూర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్సు కాంప్లెక్స్ లో పరిణితీ షూటింగుతో పాటు బ్యాడ్మింటన్ ప్రాక్టీసు గేమ్ లో పాల్గొన్నారు. అంతకు ముందు పరిణితీ హైదరాబాద్ లోని సైనా నెహ్వాల్ ఇంటికి వచ్చి బ్యాడ్మింటన్ ఆట సందర్భంగా ఆమె ధరించిన షూ, డ్రెస్సులు, ఆమె ఆట గురించి అడిగి తెలుసుకొని నోట్సు సిద్ధం చేసుకున్నారు. పరిణితీ చోప్రా లూజ్ టీషర్టు, షార్ట్ ధరించి షూటింగులో పాల్గొన్న చిత్రాలను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. అచ్చు సైనా హావభావాలను తలపించిన ఈ చిత్రాలు సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.