telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దిశ ఘటనపై స్పందించడానికి కేసీఆర్ కు మూడ్రోజులు: విజయశాంతి ఫైర్

Vijaya

దేశంలో సంచలనం రేకెత్తించిన దిశ ఘటన పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి ఘాటుగా స్పందించారు. మృగాళ్ల చేతిలో అత్యంత దారుణంగా హతమైన ఈ ఘటనపై స్పందించడానికి సీఎం కేసీఆర్ కు మూడ్రోజులు పట్టిందని విమర్శించారు. మహిళా సంఘాలు, మీడియా వర్గాలు తీవ్రస్థాయిలో ప్రశ్నించడంతో మొక్కుబడిగా ఓ ప్రకటనతో సరిపెట్టారని విమర్శించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ అంటూ ప్రకటించి కేసీఆర్ చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.

ఘటన జరిగిన వెంటనే స్పందించి ఉంటే విలువ ఉండేదని అన్నారు. దిశ కుటుంబసభ్యుల పట్ల బాధ్యత లేకుండా మాట్లాడిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో కేసీఆర్ చెప్పలేదని అన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే మా పరిధి కాదు అంటూ జరిగే జాప్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వెల్లడించకుండా కేసీఆర్ తప్పించుకున్నారని విజయశాంతి ఆరోపించారు.

Related posts