కాంటినెంటల్ షోటోకాన్ కరాటే డొ ఇండియా అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 20 వరకు ‘రిపబ్లిక్ డే కప్’ పేరుతో జాతీయ స్థాయి కరాటే పోటీలను కరీంనగర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ చల్ల హరిశంకర్ తెలిపారు. 18న ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పోటీలను జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రారంభిస్తారని తెలిపారు. 19వ తేదీన సినీ నటుడు సుమన్తో పాటు సౌత్ ఆఫ్రికాకు చెందిన వ్యాపారవేత్త దినేష్నాయుడు హాజరు అవుతారని తెలిపారు.
అకాడమీ ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా జాతీయ స్థాయి కరాటే పోటీలను కరీంనగర్లో నిర్వహించామన్నారు. ఈ ఏడాది కూడా రిపబ్లిక్ డే పేరుతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పోటీలు నిర్వహిస్తామన్నారు. 20 రాష్ట్రాల నుంచి 1500 మంది క్రీడాకారులు సీనియర్, జూనియర్, సబ్-జూనియర్ విభాగాల్లో పాల్గొంటారని వారు తెలిపారు. 20న ముగింపు కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పాల్గొంటారని వివరించారు.