కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. సాధారణ ప్రజలు అయినా సరే.. ప్రధాని అయినా సరే.. ప్రజాప్రతినిధి అయినా సరే.. అధికారి అయినా సరే దానికి మాత్రం ఏ మాత్రం వివక్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు కరోనాబారిన పడ్డారు. ఈ వైరస్తో చాలా మంది ప్రముఖులు కూడా మృతి చెందారు. తాజాగా.. తమిళ్ స్టార్ శరత్ కుమార్కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన కూతురు ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నారు. శరత్ కుమార్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారని…. కోలుకుంటున్నారని ఆమె వెల్లడించారు. శరత్ కుమార్ ఆయన కరోనా చికిత్స పొందుతున్నారు. ఆయనకు కరోనా లక్షణాలు ఏమీ లేకుండానే పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయన భార్య రాధిక పేర్కొన్నారు. కాగా.. ఇప్పటికే తమిళ స్టార్ హీరో, డీఎంకే నేత విజయ్ కాంత్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే.. ఆయన ప్రస్తుతం కోలుకున్నారు.
previous post
వాళ్ళు కేవలం పడకసుఖం కోసమే… కాస్టింగ్ కౌచ్ పై రాయ్ లక్ష్మీ షాకింగ్ కామెంట్స్