తన భార్య గురించి వైసీపీ నేతలు అనచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలోని తన పార్టీ ఆఫీస్లో కంటతడి పెట్టుకోవడం తీవ్ర దూమారం రేగుతోంది.
అసెంబ్లీలో నిన్న జరిగిన పరిణామాలపై నందమూరి బాలకృష్ణ తో ఆయన కుటుంబసభ్యులు మీడియా ముందుకు వచ్చి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబులాంటి వారిని దూషించడం చాలా బాధకరమైన విషయమని.. అందులో మా సోదరి భువనేశ్వరీని తీసుకురావడం హేయమైన చర్యని ఆయన మండిపడ్డారు.
వైసీపీ నేతలు మాట్లాడే భాష చూస్తే కూడా అసహ్యం వేస్తోందన్నారు.. అసెంబ్లీలో ఉన్నామో, మనం గొడ్ల సావిట్లో ఉన్నామా ఉన్నామో అర్థం కావడం లేదని నోరు అదుపులో పెట్టుకోండి అని .. మరోసారి..మళ్లీ ఇలాంటివి రిపీట్ అయితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.
అసెంబ్లీలో వాగ్వాదాలు మామూలే కాని వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రజాప్రతినిధుల సంస్కారం కాదన్నారు.ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడి పెట్టుకోవటం తాము ఎప్పుడూ చూడలేదని నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడాల్సిన అసెంబ్లీలో అభివృద్ధిపై బదులు.. వ్యక్తిగత అజెండా తీసుకువచ్చారని మండిపడ్డారు.
చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, రాష్ట్ర విభజన తరువాత కూడా ముఖ్యమంత్రిగా అభివృద్ధి చేశారన్నారు. కానీ ఇప్పుడు ఏం అభివృద్ధి జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.
వైకాపా నుంచి మహిళా శాసనసభ్యులు సభలో ఉన్నారన్న బాలకృష్ణ.. అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారని.. హేళన చేయొద్దని హితవు పలికారు. ఈ పరిణామాలతో కొత్త నీచ సంస్కృతికి తెరలేపారని ఆక్షేపించారు. రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
తిరుమల బస్ టికెట్లపై “జెరూసలెం”.. స్వరూపానంద ఫైర్